ఘనంగా నిజామాబాద్ పట్టణం ఆకుల పాపన్న రోడ్ వద్ద ఉన్న అమరవీరుల స్మారక స్తూపం వద్ద బుధవారం రోజున విప్లవ వీరుడు డి.వి. కృష్ణ మూడో వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంద ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ,”డి.వి. కృష్ణ అనుసరించిన విప్లవ మార్గం, కార్మిక రైతుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం ఆదర్శప్రాయమని” కొనియాడారు. ఆయన త్యాగం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు,వి.కృష్ణ ,ఎం.నరేందర్,,ఎం.వెంకట్,,డి.రాజేశ్వర్ ,ఎం.సుధాకర్, ఇతర సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ కార్యకర్తలువారు డివి కృష్ణ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. విప్లవ గీతాలతో, నినాదాలతో ప్రాంతమంతా మార్మోగిపోయింది.
