హైదరాబాద్ జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఎం.భాస్కర్కు సూపరిటెండెంట్గా ప్రమోషన్ లభించింది. అలాగే మరో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు సూపరిటెండెంట్లుగా ప్రమోషన్ కల్పించారు.
ఇందులో ఎం. భాస్కర్, రాజేశ్వర ప్రసాద్ను డీఈవో కార్యాలయానికి కేటాయించగా.. శశికాంత్ రెడ్డిని ఆర్జేడీ ఆఫీస్కు అటాచ్ చేశారు. కాగా ఈ ప్రమోషన్ ఫైల్ను ఆర్జేడీ ఆఫీస్ ఏడీ శాస్త్రి ప్రాసెస్ చేశారు.
ఈ క్రమంలో గురువారం ఆర్జేడీ విజయలక్ష్మిని కలిసి టీఎన్జీవోస్ యూనియన్ స్కూల్ ఎడ్యూకేషన్ అధ్యక్ష, కార్యదర్యులు వారి కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది.
అనంతరం టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం.హుస్సేని(ముజీబ్), వారి కార్యవర్గాన్ని ఆ సంఘం జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్, స్కూల్ ఎడ్యూకేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కె.ఆర్.రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఎం.బాస్కర్I వారి కార్యవర్గంతో కలిసి పూలబోకే అందించి శాలువా కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత స్కూల్ ఎడ్యూకేషన్ యూనిట్ క్యాలెండరు సెంట్రల్ యూనియన్ ప్రెసిడెంట్ జగదీశ్వర్, జనరల్ సెక్రటరీ ముజీబ్ అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకట్, సత్యనారాయణ గౌడ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, సెంట్రల్ యూనియన్ ఉపాధ్యక్షులు కోండల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్, ఈసీ సంతోష్ టీఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ అసోసియేట్ ప్రెసిడెంట్, టీఎన్జీవోస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు కె.ఆర్ రాజ్ కుమార్, సెక్రటరీ ఎం భాస్కర్ స్కూల్ ఎడ్యూకేషన్ నాయకులు రుగేష్, జయంతి రెడ్డి, ఫెర్రోస్ అహ్మద్, ఈసీ ప్రియాదేవ్, ముజాహిద్, వారి కార్యవర్గంతో పాటు టీఎన్జీవోస్ జిల్లా నాయకులు బాలరాజ్, వైదిక్ శాస్త్ర, ఐటీఐ సత్యనారాయణ, మాజీ సెక్రటరీ ప్రభాకర్తో కలిసి వారు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ఎడ్యూకేషన్ నాయకులు రుగేష్, జయంతి రెడ్డి, ఎంవై రవి. ఫిరోజ్ అహ్మద్, ఈసీ ప్రియదేప్ రాకూర్, ముజాహిద్ అలీ, శ్రీనివాస్, శరీకాంతరెడ్డి, రాజేశ్వర్ ప్రసాద్, సుదర్శన్, శివ, రమేష్, ఎన్.వి. పవన్ కుమార్, శివ, పరమేష్, రామోదర్, ఇస్మాయిల్ గౌస్, ఐ జాజ్
