ఆంద్రప్రదేశ్ లోని మార్కాపురం సమీపంలో రాయవరం వద్ద తెల్లవారుజామున జరిగిన ఘోర బస్ ప్రమాదంలో పలువురు దుర్మరణం చెందడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నిర్మల్ నుంచి వింజమూర్ వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్ బస్ ఇంకో వాహనాన్ని డీ కొన్న ప్రమాదంలో అగ్నికి ఆహుతి అవ్వడం అందులో ప్రయనిస్తున్న పలువురు సజీవ దహనం అవ్వడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు
ఈ ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ని వ్యక్తం చేస్తూ మృతులకు తన సంతాపం ప్రకటించారు.
