ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్ . జి.హెచ్.ఎం.సి ప్లే గ్రౌండ్ (శాఖ గ్రౌండ్) ను క్రీడాకారులకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని, వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలని, అలాగే బి జె ఆర్ నగర్ మరియు మహాభారత్ నగర్ లలో వర్షపు నీటి లైన్లను మరియు పెండింగ్ లో ఉన్న సి.సి రోడ్లను పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని జోనల్ కమిషనర్ ని కోరిన విజయ రెడ్డి.
సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ఏ ఎం ఓ హెచ్ చంద్రశేఖర్ రెడ్డి , డి చైతన్య , స్థానిక బస్తివాసులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు*
