నిజామాబాద్ జిల్లాలోని వివిధ మండలంలోని నాయబ్ తహసీల్దార్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలోనీ వివిధ మండల నాయబ్ తహసీల్దార్లుగా విధులు నిర్వహిస్తున్న వి. గంగాధర్,తెలంగ్రావు,ప్రకాష్,బాబు సింగ్ లను నిర్మల్ జిల్లాకి బదిలీ చేశారు.
అలాగే హరీష్ కుమార్, విష్ణు వర్ధన్, కే.పద్మ లను జగిత్యాల కు,బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.అలాగే ఆదిలాబాద్ లో విధులు నిర్వహిస్తున్న విజయ్ కాంత్ రావును నిజామాబాద్ కు, అలాగే నిర్మల్ లో విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ అజీజ్, దీప రాణి,రంజిత్ కుమార్,మునీరుద్దిన్ లను నిజామాబాద్ జిల్లా బదిలీ చేశారు.
జగిత్యాల జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఖాజా అబ్దుల్ మజీద్, బి.రాజశేఖర్,కార్తీక్ రెడ్డి,వినోద్ కుమార్ లను నిజామాబాద్ జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
