సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి ఏఎంబీ (AMB Mall) ఫ్లైఓవర్పై శుక్రవారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
స్కూటీ మీద ఫ్లైఓవర్పై రాంగ్ రూట్లోవెళ్తుండగా , ఎదురుగా వస్తున్న బుల్లెట్ బైక్ బలంగా ఢీకొట్టింది.ప్రమాదంలో స్కూటీ పై ప్రయాణిస్తున్న శ్రీకాంత్, విఠల్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అలాగే, బుల్లెట్ బైక్పై ఉన్న వినోద్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో, అతనిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగాఉంది
