జీవితంపై విరక్తితో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.
అర్సపల్లికి చెందిన ఎంగందుల మహేశ్ గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసయయ్యాడనీ దీంతో భార్య తాగుడు మానాలని మందలించినట్లు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన మహేశ్ నిజామాబాద్ –
జానకంపేట రైల్వే స్టేషన్ ప్రాంతంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.స్థానికుల వివరాల ప్రకారం రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.
