అనారోగ్యంతో 11 నెలల బాలుడు మృతి చెందిన ఘటన నగరంలోని ఐదవటం పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.
నగరంలోని బ్రాహ్మణి కాలనీకి చెందిన మంగ మహేష్,అనురాధ దంపతులకు జన్మించిన మంగా విగ్నేష్ అనే బాలుడు గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తెలిపారు.
ఈ మేరకు ఈనెల 28న తల్లిమంగ అనురాధ కుటుంబ కలహాలతో యాసిడ్ తాగి నిజామాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
ఈ మేరకు శుక్రవారం ఉదయం మంగ మహేష్ తన భార్య అయిన అనురాధకు ఫోన్ చేసి బాబు మృతి చెందినట్లు తెలిపారు.
ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
తల్లి ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగాధర్ పేర్కొన్నారు.
