ఢిల్లీలో జరిగిన ఇన్క్రెడిబుల్ చెఫ్ ఛాలెంజ్ (ICC) 2025లో రేయాన్ష్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు 30 పతకాలు సాధించినట్లు వ్యవస్థాపకుడు డైరెక్టర్ గడ్డం మహేంధర్ పేర్కొన్నారు. ఈ అద్భుతమైన విజయం సాధించిన విద్యార్థులకు తన అభినందనలు తెలిపారు.
కళాశాల బృందం 30 పతకాలు గెలుచుకోవడం ద్వారా కళాశాలకు గౌరవం గర్వాన్ని తెచ్చిపెట్టిందనీ అన్నారు. అందులో 1 బంగారు పతకం,12 వెండి పతకాలు, 17 కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు.
ఈ అసాధారణ విజయం మా విద్యార్థుల ప్రతిభ, కృషి మరియు శ్రేష్ఠత పట్ల నిబద్ధతకు నిదర్శనం. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి, వారికి మార్గనిర్దేశం చేసిన మార్గదర్శకులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
