నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో చొరికి గురైన 9 సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు నార్త్ రూరల్ సీఐ సతీష్ తెలిపారు.
ఆయన మాట్లాడుతూ… వివిధ సందర్భాల్లో చోరీకి గురైనట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు సీఈఐఆర్ పరిజ్ఞానంతో వాటిని కనుగొని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
దీంతో 9 సెల్ ఫోన్లు సోమవారం బాధితులకు అప్పజేసినట్లు సీఐ సతీష్,ఐదవ టౌన్ ఎస్ఐ వెంకట్రావు తెలిపారు.
