ఈ ఘటన నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ సోమవారం వెలుగుచూసింది. పోలీసులు, తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.నగర శివారులోని గూపన్ పల్లి స్మశాన వాటిక వద్ద గల పులాంగ్ వాగు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడినీ బండరాయి తో తలపై కొట్టి దారుణంగా హతమార్చారు.
స్థానికుల సమాచారం మేరకు నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ, స్థానిక ఎస్ఐ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.యువకుడిని ఎక్కడైన హత్య చేసి వాగులో పారవేసి ఉంటారని, లేక యువకుడి డేడ్ బాడి నీటి ప్రవహంకు కోట్టుకోచ్చి ఉంటుందా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.
మృతుడు ఎవరని వివరాల కోసం ఆరా తీస్తున్నారు.హత్య చేసింది ఎవరు హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
