ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణంనిజమాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా..
ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ లోని చింతల్కు చెందిన రమేశ్, చంద్రశేఖర్, సాయివిశాల్, శ్రీనివాస్, రజినీకాంత్, సంపత్ కారులో కుంభమేళా వెళ్తున్నారు.
చిట్టాపూర్ వద్ద లారీని ఓవర్టేక్ చేస్తుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది. సంపత్ అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా వారికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.
