రంగారెడ్డి కోర్టులో న్యాయమూర్తిపై దాడి ఘటనపై నిజామాబాద్ న్యాయవాదుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. నిరసనలు చేసే విషయంలో కొందరు న్యాయవాదులు ససేమిరా అన్నారు.
కేవలం న్యాయ మూర్తి మీద దాడి ఘటన ఖండిస్తూ విధులకు దూరంగా ఉన్నారు.ఇతర నిరసన కార్యక్రమాలు చేసే విషయంలో బార్ లో భిన్న అభిప్రాయాలు తలెత్తాయి న్యాయ వాదులమీద దాడి ఘటనల్లో తమ ఆందోళనలకు జడ్జి అసోసియేషన్ కనీసం మద్దతు ఇవ్వలేదని అదే జడ్జి ల మీద మనమెందుకు ప్రొటెస్ట్ చెయ్యాలని అభ్యంతరం వ్యక్తం చేశారు
న్యాయవ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, న్యాయమూర్తుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని లాయర్లు డిమాండ్ చేసారు .
. న్యాయమూర్తుల భద్రతఫై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
