HomeCRIMEదిల్ షుఖ్ నగర్ పేలుళ్ల కేసులో నిందితులకు ఉరి శిక్ష .........తుది తీర్పు ప్రకటించిన హైకోర్టు...

దిల్ షుఖ్ నగర్ పేలుళ్ల కేసులో నిందితులకు ఉరి శిక్ష ………తుది తీర్పు ప్రకటించిన హైకోర్టు …

దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులకు కింది కోర్టు ఇచ్చిన ఉరిశిక్ష నే ఖరారు చేసింది. మొత్తం ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ మంగళవారం తుది తీర్పు చెప్పింది.

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందోననేది ఉత్కంఠ గా ఉండే. ఈ తీర్పు నేపథ్యంలో హైదారాబాద్ నగరంలో పోలీస్ శాఖ అప్రమత్తం అయింది, 2013 ఫిబ్రవరి 21వ తేదీన దిల్‌సుఖ్‌నగర్‌లో భారీ పేలుళ్లు జరిగాయి .

సరిగ్గా పదేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో అనేక మంది అమాయక ప్రజలు అసువులు బాసారు . ఇండియన్‌ ముజాహిద్దీన్‌ ఉగ్ర సంస్థ టిఫిన్ బాక్సులో బాంబులు పెట్టి ఈ పేలుళ్లకు పాల్పడింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా 131మందికి పైగా గాయపడ్డారు.

కేసులో నిందితులు గా అసదుల్లాహ అక్తర్.,యాసిన్ భత్కల్ ,,తహసిన్ అక్తర్.,జియావుర్ రెహ్మాన్.ఎజాక్ షాయిక్. లతో పాటు మరో 14 మంది మీద అభియోగాలు నమోదు చేసింది. యన్ ఐ ఏ ప్రత్యేక కోర్టు లో సుదీర్ఘ విచారణ జరిగింది.

భత్కల్ తో పాటు మరో నిందితులను ఇప్పటికి యన్ ఐ ఏ పట్టుకోలేక పోయింది.2016లోనే ఉరి శిక్ష విధించగా తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించింది.

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత హైకోర్టు సైతం ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్ధించి దోషులకు ఉరిశిక్ష ను ఖరారు చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments