జిల్లా కోర్టు ప్రాంగణంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికల సందడి మొదలైంది.
బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మామిళ్ళ సాయి రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఈ రోజు వైస్ ప్రెసిడెంట్,జనరల్ సెక్రెటరీ,జాయింట్ సెక్రటరీ పోస్టులకు ఎన్నికల నిర్వహణ జరుగుతుంది.
392 ఓట్లు ఉండగా ఈ రోజు ఉదయం 10:00 గంటల నుండి న్యాయవాదులు ఉత్సాహంగా తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.
కాగా ఈ రోజు సాయంకాలం 6:00 గంటల సమయం లో పలితాలు వెలువడనున్నాయి.
