నగరంలోని శ్రీ సాయి మెస్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది.వివరాల్లోకి వెళ్లితే..
నిజామాబాద్ బస్టాండ్ సమీపంలో ఉన్న సాయి మెస్ టిఫిన్ సెంటర్ లో ఒక్కసారి గా మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్ని మాపకశాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
అగ్ని మాపకశాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
