కుల బహిష్కరణ కేసులో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు అయిదేళ్ల జైలు శిక్ష విధిస్తు యస్సి ఎస్టీ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. , జక్రన్పల్లి మండలం కొలిఫ్యాక్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల హనుమాండ్లు అతని కుటుంబ సభ్యులను 2020 లో పొలం విషయంలో కొలిపాక విడిసి సభ్యులు కుల బహిష్కరణ చేశారు.
బాధితుడి పిర్యాదు మేరకు జక్రాన్ పల్లి పోలీసులు అప్పటి విడిసి సభ్యులు 16 మంది పై యస్సి ఎస్టీ కేసుతో పాటు సంఘ బహిష్కరణ కింద కేసు నమోదు చేసారు. ఈ కేసులో నిందితుల మీద నమోదు చేసిన అభియోగాలు రుజువు కావడంతో జిల్లా సెషన్స్ జడ్జ్ శ్రీనివాసు నిందితులకు 5 సం.ల జైలు శిక్ష విధించారు.
