నిజామాబాద్ భక్తుల సౌకర్యార్థం నిజామాబాద్ నుండి యాదగిరిగుట్ట మరియు స్వర్ణగిరికి ప్రత్యేక బస్సు సేవను జూన్ 27వ తేదీన ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ నిజామాబాద్-2 డిపో మేనేజర్ సాయన్న తెలిపారు.
ఈ బస్సు ఉదయం 5 గంటలకు నిజామాబాద్ డిపో నుంచి బయలుదేరి, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి దర్శనం అనంతరం మరుసటి రోజు ఉదయం 5 గంటలకు తిరిగి నిజామాబాద్ చేరుకుంటుంది.
ప్రయాణ టికెట్ ధర పెద్దలకు: ₹1,400పిల్లలకు: ₹1,050యాత్రలో భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు.
