స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి సిద్ధం అవుతుంది. వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు సాగేలా పీసీసీ కార్యాచరణ రూపొందిస్తుంది.
శ్రమదానం పాదయాత్ర లతో పాటు విధిగా కార్యకర్తల భేటీలు జరిగేలా పీసీసీ పక్క ప్రణాళిక ఖరారు చేసింది. ఆరు జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు వుండేలా ప్లాన్ సిద్ధం చేసారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ తో కలిసి ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా రంగంలోకి దిగబోతుంది. ఈ నెల 31 న రంగారెడ్డి జిల్లా పరిగి అసెంబ్లీ సెగ్మెంట్ లో మొదలు పెట్టి ఆగస్ట్ 6 న వరంగల్ జిల్లా వర్దన్నపేట్ లో చివరి మీటింగ్ జరగనుంది.
ఒక్కో నియోజకవర్గంలో సాయంత్రం పాదయాత్ర రోజంతా శ్రమదానఁ మధ్యాహ్నం వేల పార్టీ క్యాడర్ తో భేటీలు జరగబోతున్నాయి.
ఈ నెల 31 న పరిగి లో సాయంత్రం పాదయాత్ర చేసి అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు ఉదయం శ్రమదానఁ మధ్యాహ్నం పార్టీ సమావేశం సాయంత్రం మళ్ళీ పాదయాత్ర ను నిర్వహించనున్నారు.
మరుసటి రోజు మెదక్ జిల్లాలో అందోల్ లో ఆగస్టు 3 న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఆగస్టు 4 న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ లో ఐదున కరీంనగర్ చొప్పదండి లో అయిదు న ఆరు న వరంగల్ జిల్లా వర్దన్నపేట్ లో లో ముగింపు కానుంది.
ప్రజల్లో ప్రభుత్వ పనితీరు ను అంచనా వేయడానికే ఈ కార్యం తలపెట్టారని పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
