డిచ్పల్లి ఇందల్వాయి టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షులు తడిసిన వెంకటరెడ్డి , ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆకుల వెంకటేష్ (రాజు ) ఆధ్వర్యంలో డిచ్పల్లి ఇందల్వాయి టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
డిచ్పల్లి రెడ్డి ఫంక్షన్ హాల్ లో ప్రమాణ స్వీకరణ మహోత్సవం నిర్వహించారు. గౌరవ అధ్యక్షులుగా డిచ్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు అమృత పూర్ గంగాధర్ ని నియమించుకోవడం జరిగింది .
లీగల్ అడ్వైజర్ గా రాజేందర్ రెడ్డిని,మాణిక్ రాజు ని ( బార్ కౌన్సిల్ అధ్యక్షులు) నియమించుకొన్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో టు వీలర్ మెకానిక్ అసోసియేషన్ డిచ్పల్లి ఇందల్వాయి అధ్యక్షులు ముల్క శ్రీనివాస్, వాళ్ల బాడీ మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తడిసిన వెంకట రెడ్డి, తెలంగాణ కోశాధికారి వీరన్న శ్రీనివాస్, నిజామాబాద్ అధ్యక్షులు ఆకుల వెంకటేష్ (రాజు) కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్, బాన్సువాడ అధ్యక్షులు రఫీ, బిచ్కుంద అధ్యక్షులు అబ్బాస్, టూవీలర్ ఆటోమొబైల్ అసోసియేషన్ వెంకన్న,నిజాంబాద్ క్యాషియర్ లక్ష్మణ్, విజయ్ జాయింట్ సెక్రెటరీ రాజేష్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
