ఈరోజు నిజామాబాద్ జిల్లా ఆరె కటిక సంఘం ఎన్నికలు నగర సంఘంలో ఓటింగ్ పద్ధతి ప్రకారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని మండలాల నుండి ఓటర్లు వచ్చి వారి యొక్క ఓట్లను సద్వినియోగం చేసుకోవడం జరిగింది.
మొత్తం 121 ఓట్లకు గాను 119 ఓట్లు పోలయినాయి. గెలుపొందిన న్యామ్ తాబాద్ రవీందర్ ప్యానెల్ కు 79 ఓట్లు వచ్చాయి. ఓడిపోయిన మోహన్ 40 ఓట్లు రావడం జరిగింది. 39 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది.
అధ్యక్షులుగా న్యాయంతాబాద్ రవీందర్, ప్రధాన కార్యదర్శిగా మిర్యాల్ కార్ మోహన్, కోశాధికారిగా వాంకర్ శ్రీనివాస్, గెలుపొందినట్లు ఎన్నికల అధికారి బిల్లి. హుస్సేన్ అధికారికంగా ప్రకటించడం జరిగింది.
