అసాంఘిక కార్యకలాపాలు, కట్టడిలో టాస్క్ ఫోర్స్ పాత్ర ఎంతో కీలకం. ఇందులో పనిచేసే అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పక్కాగా నిఘా ఉంచి దాడులు జరిపితేనే అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుంది.
కానీ కొందరు అధికారులు, సిబ్బంది అక్రమార్కుల నుంచి మామూళ్లు తీసుకోవడం పోలీస్ శాఖకే తెచ్చిపెడుతోంది.ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టాల్సిన టాస్క్ఫోర్స్ విభాగం సుప్తావస్థలోకి వెళ్లింది.
అసాంఘిక కార్యక్రమాలను నిలువరించేలాల్సిన విభాగంలో పని చేసే పోలీసులే ఇష్టారీతిన వసూళ్లకు తెగబడటం సంచలనం రేపింది.దీంతో సీపీగా సాయి చైతన్య బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు కావొస్తున్నప్పటికీ టాస్క్ఫోర్స్ విభాగం పనితీరులో మార్పు కానరాలేదు.
సీపీ ఆదేశాలతో దాడులు నిర్వహించడం మినహాయిస్తే అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెట్టింది లేదు. దాడులు నిర్వహించిన దాఖలాలు అంతంత మాత్రమే అన్నట్లుగా కొనసాగుతోంది.
ఈ దశలో టాస్క్ఫోర్స్ విభాగం తీరుపై ఆరోపణలు వస్తుండటంతో టాస్క్ ఫోర్స్ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య ఆ విభాగంలోని 14 మందిని బదిలీ చేశారు.
తక్షణ చర్యల్లో భాగంగా ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, 9 మంది కానిస్టేబుళ్లను తొలగించి ఇతర ప్రాంతాలకు బదిలీ వేటు వేశారు.అసాంఘిక కార్యకలాపాలు, కట్టడిలో కీలకంగా ఉండే టాస్క్ ఫోర్స్ లో బదిలీలు చేసి వారం గడవడంతో పునరుద్ధరణ కొత్తవారితో పునరుద్ధరణ ఎప్పుడూ చేస్తారని ఎదురుచూస్తున్నారు.
ఇందుకోసం ఎలాంటి రిమార్కు లేని వారికోసం టాస్క్ ఫోర్స్ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ పూర్తి స్థాయిలో ఏసిపి లేకపోవడంతో కుప్పకూలే దుస్థితి..గత కొంత కాలం నుంచి ఇప్పటి వరకు ముగ్గురు సీపీలు మారినప్పటికీ టాస్క్ ఫోర్స్ లో మార్పు కానరావడం లేదు. సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ ఉన్నప్పుడు ఈ విభాగం తీవ్రమైన ఆరోపణలకు గురైంది.
నాటి ఏసీపీ ఇష్టారీతిన వ్యవహరించిన తీరుతో పోలీస్ శాఖ పరువు బజారున పడింది. దీంతో నాటి సీపీ కల్మేశ్వర్ సింగనేవార్ నేరుగా డీజీపీకి టాస్క్ఫోర్స్ ఏసీపీపై నివేదికను సమర్పించారు. దీంతో ఏసిపి నీ మొదట బదిలీ, ఆ తర్వాత సస్పెన్షన్ వేటు వేశారు.
దీంతో నిజామాబాద్ కమిషనరేట్లోనీ టాస్క్ఫోర్స్ విభాగంలో ఏసీపీ లేక 10 నెలలు అవుతుంది. అయినా ఇన్ఛార్జీ అధికారితోనే ఈ విభాగాన్ని నడిపిస్తున్నారు.
ఇన్ఛార్జీ అధికారి అటు సీసీఎస్ లో ఉంటూ ఇటు టాస్క్ ఫోర్స్ పూర్తి స్థాయిలో పని చేయలేక సమస్య కుప్పకూలే దుస్థితి వచ్చిందనీ ఆరోపణలు వెలుగుతున్నాయి..
