దర్ పల్లి మండలకేంద్రంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు కత్తెర తో ఆరుగురి మీద విరుచుక పడ్డాడు తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరు మృతి చెందాడు .ఎన్టీఆర్ కాలనికి చెందిన వడ్ల దాసు సైకో ల వ్యవహరించాడు .మొదటగా కాలనీలో గల మచ్చ లక్ష్మీ ని కత్తెరతో పొడవగా ఆమె కూతురు గౌతమి అడ్డు వెళ్ళగా ఆమెను కూడా పొడిచాడు.అక్కడ గొడవ జరుగుతుందని గమనించి పక్కింటి వారు వెళ్ళగా వారిలో శెట్పల్లి నాగరాజు,అతని భార్య శోభ ను కూడా కత్తెరతో పొడిచి,అక్కడి నుండి కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్న శెట్పల్లి భోజేశ్వర్ అనే వ్యక్తి షాపు దగ్గరికి వెళ్లి అతన్ని కూడా కత్తెరతో పొడవడం జరిగింది.గాయపడ్డ నలుగురిని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించడం జరిగిందని,ఎవరికి ప్రాణాపాయం లేదని,సంఘటనకు చెందిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని,ప్రస్తుతం విచారణ జరుగుతుందని పూర్తి వివరాలు తరువాత వెల్లడిస్తామని పోలీస్ వారు తెలిపారు.
