ప్రైవేట్ కళాశాల ఫీజు రెంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు ప్రొద్దుటూరి అభిలాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
శుక్రవారము పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లో పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు.
విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులకు కళాశాల యజమాన్యాలకు తీవ్రమైన ఇబ్బందుల గురీ కావడం జరుగుతుంది.
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వల్ల కాలేజీలు మూతపడి విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి వస్తుంది.
కావున ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో…రవి, రాజ్ కుమార్, యుగేందర్, కైలాష్, సాయికుమార్, ఆకాష్, దీపక్, సంతోష్, శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
