కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం లో శనివారం పట్ట పగలే దొంగలు తెగబడ్డారు . బైకు మీద వెళ్తున్న తల్లీ కొడుకు ను ఆపి కత్తి తో దాడిచేసారు .
తల్లి మెడలో లో ఉన్న పుస్తెలు తాడు …నేక్ లెస్ లాక్కున్నారు. ఏడు తులాల మేరకు నగలు ఎత్తుకొని పారిపోయారు ఈ ఘటనలో కొడుకు కు కత్తి గాయాలు కావడంతో అతని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలం రాంపూర్ కు చెందిన ఎల్లయ్య తన తల్లి సత్తెమ్మ తో కలసి శనివారం పంక్షన్ వుందని మద్నూర్ బంధువుల ఇంటికి బైకు మీద వస్తున్నారు గుర్తు తెలియని ఇద్దరు యువకులు పల్సర్ బైక్ మీద మాన్సన్ పల్లి శివారు నుంచి వెంబడించారు మద్నూర్ శివారు వద్దకు రాగానే ఎదురుగా వచ్చి బైకు ఆపారు.
