ఆగి ఉన్న ఓ కంటైనర్ ను ట్రావెల్స్ బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటన డిచ్పల్లి మండలం సుద్దపల్లి 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. సుద్దపల్లి వద్ద అప్పుడే ఆగిన ఓ కంటైనర్ ను ఆదిలాబాద్ నుంచి హైదారాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది.
ఈ క్రమంలో లారీని డోకొట్టిన తర్వాత బస్సు డివైడరైపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న సుమారు 10 మందివరకు ప్రయాణికులకు గాయాలైనట్లునట్లు తెలిపారు.
క్షతగాత్రులను హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
