జూబ్లీహిల్స్ అసెంబ్లీ అభ్యర్థి ని బీజేపీ ఎట్టకేలకు ఖరారు చేసింది. అనేక మంది పేర్లు తెరమీదికి వచ్చాయి.జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, విక్రమ్ గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి.
కానీ అధిష్టానం మాత్రం లంకల దీపక్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేసి మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
ప్రస్తుతం ఆయన బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు.ఆయన కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడిగా ముద్ర ఉంది
