జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు సీఐలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఐజీ కార్యాలయంలో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న మండల అశోక్ ను నిజామాబాద్ కమిషనరేట్ కు బదిలీ చేశారు.
అలాగే నిజామాబాద్ కమిషనరేట్ లో వీఆర్ లో అటాచ్ గా ఉన్న చింతలతడేం శ్రీనివాస్ ను నిజామాబాద్ రూరల్ పీఎస్ కు అటాచ్ చేశారు.అలాగే సీసీఆర్ బి లో ఉన్న సధుల సతీష్ కుమార్ ను నాలుగవ టౌన్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
