డిచ్పల్లి మండలం ధర్మారం(బి) లో నిన్న జరిగిన ఉత్కంఠభరిత సర్పంచ్ ఏలక్షన్ లో గిట్టిపాటి వాసుబాబు 1079 భారీ మెజారిటీతో సమీప అభ్యర్థి సాయిబాబా పై గెలుపోందాడు. గెలిచిన వాసుబాబు కి 2279 రాగ త్రిపురణేని సాయిబాబా కి 1214 ఓట్లు వచ్చాయి.
మొదటి రౌండ్ నుండే అధిక్యంలో ఉన్న వాసుబాబు చివరి రౌండ్ ముగిసేసరికి 1079 ఓట్ల మెజారీటితో గెలుపోందాడు. రాత్రి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో గ్రామం వాసుబాబుకు పట్టంకట్టింది.
ఉదయం నుండి ధర్మారంలో ఒకరిపై ఒకరు అరోపణలు చేస్తు రోడ్డంత ట్రాఫిక్ జామ్ అయి కొంత సమస్యగా మారిందని తెలిసిందే. మొత్తం 14 వార్డుల్లో 12 వార్డులు వాసుబాబు ప్యానేల్ గెలుపోంది మహమ్మద్ సల్మన్ ఉపసర్పంచ్ నామినేట్ అయ్యారు.
