ఈ రోజు బీజేపీ జిల్లా కార్యాలయం లో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో
నేషనల్ హెరాల్డ్ అనేది రాజకీయ కక్ష సాధింపు కాదని, కాంగ్రెస్ పార్టీ పెద్దల కుటుంబం చేసిన ఆర్థిక అవినీతికి సంబంధించిన చట్టబద్ధమైన కేసు అని స్పష్టం చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనం ఎలా ఒక కుటుంబానికి దారి మళ్లిందో దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్పై ఉందన్నారు.
ED, కోర్టులు విచారిస్తున్న కేసును “ప్రతీకారం” అని కాంగ్రెస్ నేతలు చెప్పడం న్యాయవ్యవస్థను అవమానించడమేనని మండిపడ్డారు. దోషులైతే శిక్ష తప్పదని, ఎంత పెద్ద నేతలైనా చట్టం ముందు సమానమేనని స్పష్టం చేశారు.
ఉపాధి హామీ పథకం విషయంలో
ఉపాధి హామీ పథకాన్ని కాగితాలకే పరిమితం చేసిన పార్టీ కాంగ్రెస్ అని, మోదీ ప్రభుత్వం వచ్చాకే ఉపాధి పథకానికి నిధులు, పారదర్శకత, నిజమైన ఉపాధి వచ్చిందన్నారు.
కాంగ్రెస్ పాలనలో కూలీల పేర్లతో డబ్బులు కొట్టేసిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని, నేడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా డబ్బులు నేరుగా కూలీల ఖాతాల్లో పడుతున్నాయన్నారు.
ఇది బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితమని తెలిపారు.కాంగ్రెస్ పార్టీకి ఉపాధి పథకం గుర్తొచ్చింది అంటే ప్రజలు ఇక నమ్మడం లేదని, అందుకే దృష్టి మళ్లించేందుకు ముట్టడులు, ఆందోళనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.బీజేపీ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని, పేదల ఉపాధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎంత అడ్డంకులు సృష్టించినా, ప్రజల కోసం పనిచేయడం ఆపేది లేదని గట్టిగా హెచ్చరించారు జిల్లా బీజేపీ కార్యాలయం ముట్టడి అనేది ఒక డ్రామా అన్నారు దమ్ముంటే అభివృద్ధి మీద బహిరంగ చర్చకు రావాలి అన్నారు అంతే గాని మా కార్యాలయం దగ్గరికి వచ్చే అర్హత లేదన్నారు మా పార్టీ కార్యకర్తలు నాయకులు తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంట్లో నుంచి బయటకురారు అన్నారు అభివృద్ధి మీద ద్రుష్టి పెట్టాలని చురకలు అంటించారు
ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మి నారాయణ,న్యాలం రాజు,ప్రమోద్ కుమార్, పద్మ రెడ్డి,అనిల్,శివ ప్రసాద్,ఇప్పకాయల కిషోర్, తారక్ వేణు, కోడూరు నాగరాజ్,ఆనంద్ రావు,పంచారెడ్డి శ్రీధర్,మల్లేష్ గుప్తా, బూరుగుల వినోద్,మురళి కృష్ణ,బైకన్ మధు, నారాయణ యాదవ్, బొబ్బిలి వేణు,బొట్టు వెంకటేష్,అమందు విజయ్ కృష్ణ, చిరంజీవి, సంతోష్,సురేష్,నరేష్ గౌడ్, ఆనంద్, పవన్, లక్షమన్,సందీప్, సాయినాథ్,తదితరులు పాల్గొన్నారు
