మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ కి మెజార్టీ దక్కలేదు. మరో 24 గంటల్లో ఛైర్మెన్ వైస్ చైర్మెన్ ఎన్నికలు జరగాల్సి వుండగా కామారెడ్డి మున్సిపాల్టీ లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
మెజార్టీకి అడుగు దూరంలో ఆగిపోయిన కాంగ్రెస్ ఎట్టకేలకు మ్యాజిక్ ఫిగర్ ను చేరింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ మంత్రాంగం ఫలించింది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ఛైర్మెన్ స్థానాన్ని దక్కించుకోబోతుంది.
మొదట స్వాతంత్ర అభ్యర్థులు ముగ్గురు కాంగ్రెస్ లో చేరగా ఆదివారం బిఆర్ యస్ కు చెందిన నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ శిబిరంలోకి వచ్చారు. కామారెడ్డి మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ బలం 26 చేరింది.
16 బీజేపీ కి 16 మంది సభ్యులుండగా బి ఆర్ ఎస్ కు 11 సభ్యులుండే కానీ అందులో నలుగురు పార్టీ పిరాయించడంతో బిఆర్ యస్ బలం 8 కి పడిపోయింది ఇండిపెండెంట్ లు ముగ్గురు ఉమారాణి నాగమణి, షేక్ బబ్లూ షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో ముగ్గురు కౌన్సిలర్లు శుక్రవారం రాత్రి చేరారు. .
