నిజామాబాద్ నగరంలోని అశోక్ సాగర్ చెరువులో పడి బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గంగాస్థాన్ ఎస్బీఐ శాఖలో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న కొటారికరి శ్రీధర్ ఆదివారం అశోక్ సాగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆరో టౌన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
