ట్రాఫిక్ ఏసిపి నారాయణ….
నిజామాబాద్ సీపీ కామలేశ్వర్ ఆదేశాల మేరకు.మంగళవారం నగరంలోనీ బైపాస్ రోడ్డు వద్ద పోలీసులు, ఆర్టిఏ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ఏసిపి నారాయణ తెలిపారు.
మద్యం తాగి వాహనాలు నడపడం, ట్రిబుల్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలను,ఓవర్లోడ్తో కూడిన వాహనాలు, నాసిరకం రిజిస్ట్రేషన్ ప్లేట్లతో వాహనాలు నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 60 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు ట్రాఫిక్ ఏసిపి తెలిపారు.
ఈ తనిఖీలో ట్రాఫిక్ సిఐ వెంకట్ నారాయణ, ట్రాఫిక్ ఎస్ఐ సుమన్, రూరల్ టౌన్ ఎస్ఐ మహేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
