HomeCRIMEప్రమాదవశాత్తు వ్యక్తి మృతి..

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి..

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన ఘటన నవిపే మండల కేంద్రము లో చోటు చేసుకుంది. నవిపేట్ ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.

మండలంలోని వీరన్న గుట్ట కు చెందిన ప్రవీణ్ కుమార్(40). ఈ నెల 15 ఉదయం తన కూతురు నీ స్కూల్లో వదలడానికి వెళ్ళగా ప్రమాదవశాత్తు బైక్ స్కిడ్ అయ్యి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యుల హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

చికిత్స పొందుతూ బుదవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments