గుర్తు తెలియని వాహనం ఢీ కొని మహిళ మృతి చెందిన ఘటన నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది.పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం నవిపెట్ మండలానికి చెందిన కోస్లి గ్రామానికి చెందిన సంగీత (45).
భర్త లు కలిసి రెండవ శనివారం నిమిత్తం హాస్టల్ లో ఉన్న పిల్లలను కలవాడని వెళ్తున్నారు.
ఈ మేరకు సారంగాపూర్ నుంచి నిజామాబాద్ వైపుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం వెనకనుంచి ఢీ కొనడంతో సంగీత అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
