పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ అధికారుల మెరుపు దాడులు నిర్వహించారు.
వివరాల్లోకి వెళ్లితే కోటగిరి మండలంలోని లింగాపూర్ గ్రామ పరిధిలో 9మంది పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి వారిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
వారి నుంచి రూ.46,460 నగదు,9సెల్ ఫోన్లు, 5బైక్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అనంతరం 9మందిపై కోటగిరి పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు పేర్కొన్నారు.
