కాలువ కబ్జాకు గురై తాము పడుతున్న ఇబ్బందులను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు.
దశబ్దాలనాటి కాలువను చెడగొట్టి తమ పంటపొలంలో కలిపేసుకుంటున్నారని ధర్పల్లి మండలం లోని రేకులపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
ధర్పల్లి మండలం లోని రేకులపల్లి గ్రామానికి చెందిన దుమాల రాజరెడ్డి 10 మీటర్ల మాటు కాలువను చేరువులకు వెళ్లె నీరు వెళ్లకుండా కాలువను కబ్జాచేసుకొని ఎకర భూమిని కలుపుకున్నారని పేర్కొన్నారు.
కాలువ కబ్జా చేశారని పలు మార్లు మండల తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు.గతంలో ఉన్న తహసీల్దార్ కాలువను యదావిధిగా చేయాలని పలు మార్లు మొమె ఇచ్చిన ఆ కాలువను యాదవిధిగా చేయకుండా నిర్లక్ష్యము వహిస్తున్నారని మండిపడ్డారు.
ప్రస్తుత ధర్పల్లి తహాసల్దార్ మాలతి కు ఎన్ని మార్లు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్య తీసుకొనలేదనీ పేర్కొన్నారు.కబ్జాకు గురైన కాలువ పూర్తిస్థాయిలో సర్వే చేయాలని డిమాండ్ చేశారు.
