బైక్ పై నుండి క్రింద పడి వ్యక్తి మరణించిన ఘటన నవీపేట్ మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ కోటగల్లి కి చెందిన కే.శంకర్ వయసు( 55 ) వృత్తి బీడీ కార్ఖానాలో పనిచేస్తూ ఉండేవారు.
శుక్రవారం రాత్రి వృత్తిరీత్యా నవీపేట్ కి వెళ్తుండగా మార్గ మధ్యలో బైక్ అదుపు తప్పి కింద పడ్డారు వెంటనే సమాచారం తెలుసుకున్న నవీపేట్ పోలీసులు అంబులెన్స్ లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు.
