నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మెడిసిన్ సరఫరా కోసం ప్రభుత్యం టెండర్ ను విడుదల చేసింది. టెండర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపరంటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ ఓ ప్రకటనలో తెలిపారు.
నిజామాబాద్ చైర్మన్ – జిల్లా కొనుగోలు కమిటీ ఆదేశాలమేరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 2 సంవత్సరాల కాల పరిమితికి డ్రగ్స్,మెడిసిన్, మెటీరియల్,సామాగ్రి(శాస్త్ర చికిత్స వస్తువులు),రి ఎజెంట్స్, అర్థో ఇంప్లాంట్లు,సరఫరా కోసం అర్హత కాగిన తయారీదారీ/అధీకృత డీలర్లు/నమోదిత సంస్థలు నుంచి టెండర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తు రుసుము రూ. 5000 డిడి ద్వారా చెల్లించాలని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ నెల 19 నుంచి 27 వ తేది లోపు సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రి కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను అందజేయాలని సూచించారు.
దరఖాస్తుదారులు మరింత సమాచారం కొరకు ప్రభుత్వ ఆసుపత్రి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
