త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై పీసీసీ కసరత్తులు మొదలు పెట్టింది గురువారం పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీపదాస్ మున్షి పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ లు నాలుగు జిల్లాల నేతలతో గాంధీ భవన్ లో భేటీ అయ్యారు.
మెదక్, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల మంత్రులు, ఇంచార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో భేటీ అయ్యారు .
ఆ జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల స్ధానానికి పార్టీ అభ్యర్థి ఎంపిక, గెలుపు వ్యూహాల అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు .
కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన ఈ ఎమ్మెల్సీ స్ధానానికి వెలిజాల రాజేందర్, విద్యా సంస్థల అధినేత నరేందర్, కేకే మహేందర్ రెడ్డి సహా పలువురు ఆశావహులు టికెట్ ఆశిస్తున్నారు.
అయితే తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికే మరోసారి టికెట్ ఇవ్వాలని కొందరు సీనియర్ నేతలు ప్రతిపాదించారు.
