భారతీయ జనతా పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం శనివారం నిజామాబాద్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు దినేష్ జెండా ఎగరవేశారు . ఎంపీ అర్వింద్ పార్టీ కార్యకర్తలకు స్వీట్లు పంచి పెట్టారు. ప్రగతి నగర్ లో 36 పోలింగ్ బూత్ కు సంబంధించి హనుమాన్ మందిర్ వద్ద జెండా ఎగరవేసారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి వినాయక్ నగర్ మున్నారుకాపు సంఘంలో టిఫిన్ బైఠక్ లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ముఖ్య నేతలతో కలిసి లంచ్ బైఠక్ లో భాగంగా రాజన్న హోటల్ లో భోజనం చేశారు
