నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం దర్యాప్తు రైల్వే గేట్ వద్ద ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై పట్టాలపై వెళ్లి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. భీమ్ గల్ కు చెందిన జగదీష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై రైల్వే పట్టాలపై రైల్ కి ఎదురుగా వెళ్లాడు.
రైల్వే అధికారులు సిగ్నల్ ఇవ్వకపోవడంతో కో పైలెట్ రైలును నిలిపివేశారు. ఘట్నా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు వాహనంతో సహా యువకుడ్ని పట్టాలపై నుండి తప్పించి అదుపులోకి తీసుకున్నారు.
ఆత్మహత్యకు గల వివరాల పై ఆరా తీయగా యువకుడి భార్య భీమ్ గల్ పోలీస్ స్టేషన్లో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు రైల్వే పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
