వినాయక నగర్ లోని శ్రీ చైతన్య పాఠశాలలో *భారతరాజ్యాంగ*దినోత్సవం సందర్భంగాను పాఠశాల పిల్లలతో చాలా ఘనంగా ర్యాలీ తీయడం జరిగింది.రాజ్యాంగం గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేస్తూ రాజ్యాంగ రచనలో పలుపంచుకున్న వారిని గౌరవించడం, రాజ్యాంగ సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంను ఉద్యేశించి పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్. లతగారు మాట్లాడుతూ “ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతి రూపమే మన రాజ్యాంగం”అని అందరు విధులను, హక్కులను పాటించాలని చెప్పడం జరిగింది.
ఈ ర్యాలీలో పాఠశాల ఏ. జి. యమ్. మహిపాల్ రెడ్డి గారు, ప్రిన్సిపాల్ సి. హెచ్. లత,డీన్ సుంకరి రాజ్ కుమార్, ఏ. ఓ. ప్రదీప్ గౌడ్ మరియు ఇంచార్జ్లు మరియు తోటి సిబ్బంది పాల్గొనడం జరింగింది.
