జైలు నుంచి వచ్చాక మొదటిసారి గా ప్రజాక్షేత్రంలోకి వచ్చిన ఎమ్మెల్సీ కవిత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి ఝలక్ ఇచ్చింది. మాటల తో విరుచుకపడిన కవిత ధిక్కార యాక్షన్ లోకి దిగింది. ప్రభుత్వ జీవో ను ధిక్కరించి22 అడుగుల తెలంగాణ తల్లి పాత నమూనా తో విగ్రహం ఏర్పాటు కు ఆమె ఆదివారం జగిత్యాల్ లో భూమి పూజ చేశారు.
రేవంత్ ప్రభుత్వం కొత్త తెలంగాణ తల్లి కొత్తవిగ్రహం ను తెరమీదికి తెచ్చింది. తెలంగాణ తల్లీ విగ్రహం నమూనా మార్చడం ఫై బిఆర్ యస్ కాంగ్రెస్ పార్టీ ల మధ్య మాటల యుద్ధం జరిగింది. కొత్త విగ్రహం విషయంలో రేవంత్ ప్రభుత్వం ఏకంగా జీవో నే తెచ్చింది.
విగ్రహ నమూనా మార్చితే ఈ జీవో మేరకు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లిని అంగీకరించే ప్రసక్తే లేదంటూ ఉద్యమ తెలంగాణ తల్లినే గ్రామ గ్రామాన ప్రతిష్టించుకుంటామని కవిత పేర్కొన్నారు గెజిట్ ఇచ్చినా, కేసులు పెట్టిన భయపడేది లేదన్నారు అందరికీ ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపిన ఉద్యమ తెలంగాణ తల్లినే ఆరాధిస్తామని అలాగే తెలంగాణ తల్లిలోని బతుకమ్మను కాపాడుకుంటమన్నారు
