కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఏబీవీపీ నగరంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఎల్లమ్మగుట్ట చౌరస్తాలోని కార్గిల్ విజయస్థూపం వరకు ఈ ర్యాలీ జరిగింది.
ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు నవీన్ మాట్లాడుతూ.. కార్గిల్ వీరులచూపిన ధైర్యసాహసాలు దేశప్రజల గుండెల్లో నిలిచిపోయాయని పేర్కొన్నారు. దేశం కోసం పోరాడేందుకు ప్రతిఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
