నగరంలోని చప్పల్బజార్కు చెందిన అజయ్ దరక హైదరాబాద్–సికింద్రాబాద్ జిల్లా మహేశ్వరి సభ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నియమితులయ్యారు.
మహేశ్వరి సమాజ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు సభ ప్రతినిధులు తెలిపారు.
తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన మహేశ్వరి సభ పెద్దలకు అజయ్ దరక కృతజ్ఞతలు తెలిపారు. సభ అభివృద్ధికి, సమాజ సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు.
ఆయన నియామకంపై చప్పల్బజార్ ప్రాంతానికి చెందిన మహేశ్వరి సమాజ సభ్యులు, నాయకులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.
