నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ సమీపంలో ఉన్న దత్తాత్రేయ ఆలయం వద్ద ప్రవహించే పులాంగ్ వాగులో సోమవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.
బర్రెలు కాసేవారు వాగులో కొట్టుకొచ్చిన మృతదేహాన్ని చూసి, వెంటనే నాలుగవ ఠాణా పోలీసులకు సమాచారం ఇవ్వగా . పోలీసులు అక్కడికి వచ్చి , మృతదేహాన్ని వాగులోనుంచి బయటకు తీసారు .
మృతుని యొక్క వయస్సు 35 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండొచ్చని పోలీసులు వెల్లడించారు. మృతదేహానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు.
