బొలోరో వాహనం లో వచ్చిన ముఠా నిజామాబాద్ నగరంలో మరో ఏటియం ను లూటీ చేయడానికి యత్నించింది . సకాలం లో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో దొంగలముఠా బొలోరోలో పారి పోయింది కానీ పోలీసులు వారిని జిల్లా సరిహద్దుల దాక వెంటాడింది.
నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడి పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆవరణ లో ఉన్న ఏటియం లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు మిషన్ ను తెరవడానికి యత్నించారు కానీ అలారం మోగింది.
దారి వెంట వెళ్లే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వచ్చిన పోలీసులు దొంగలను వెంబడించారు. ఈ ముఠా పట్టుకొనే క్రమంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు బలగాలు రహదారుల మీద పహారా చేసాయి
