కుటుంబం లో ముగ్గురిని తెగనరికిన ఓ వ్యక్తి తానూ ఆత్మ హత్య కు పాల్పడిన ఉదంతం వికారాబాద్ జిల్లాలో ని కుల్కచర్ల లో జరిగింది. భార్య అలవేలు,వదిన హన్మమ్మ,కూతురు శ్రావణి లను కొడవలితో హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు మరో కూతురు అపర్ణ.మాత్రం అలజడి తో నిద్రలేచి తప్పించుకుంది.
రోజువారీ కూళీగా పనిచేసే యాదయ్య తన భార్య అలవేలు పై నిత్యం అనుమానం వ్యక్తం చేస్తూ గొడవ పడేవాడని ఇద్దరి మధ్య … రాజీ చేసేందుకు అయన కు వదిన వరస అయ్యే హన్మమ్మ శనివారం యాదయ్య ఇంటికి వచ్చింది ఆదివారం తెల్లవారు జామున కత్తి తో విచక్షణ రహితంగా వదిన ,భార్య, లతో పాటు కూతురు లఫై కొడవలితో దాడి…
చేసాడు నిద్రలో ఉన్న వారంతా ఎక్కడిక్కడే మృతి చెందారు. మరో కూతురు అపర్ణ మాత్రం తప్పించుకుంది హత్యల అనంతరం యాదయ్య ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు
