ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కు అలవాటు పడి ఆన్ లైన్ యాప్ లో లోన్ తీసుకోని చెల్లించలేక ఓ బీటెక్ స్టూడెంట్ ఆత్మ హత్య కు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సదాశివపేట్లో బీటెక్ చదువుతున్న వినీత్ ఐపీఎల్లో క్రికెట్ లో బెట్టింగ్లకు బానిస గా మారాడు .
కానీ బెట్టింగ్ లకు అవసరమైన నగదు కోసం అన్ లైన్ లో యాప్ల ద్వారా అప్పులు తీసుకున్నాడు. – సదాశివపేట పట్టణానికి చెందిన బీటెక్ విద్యార్థి చింత వినీత్(25) రూ.25 లక్షలు అప్పు తెచ్చి బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకున్నాడు.
తెచ్చిన అప్పులు చెల్లించే దారిలేక వినీత్ తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. . విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు